header

Sunday 20 November 2016

చేపల పులుసు

చేపల పులుసు


కావల్సినవి:
 చేపముక్కలు (శుభ్రం చేసినవి) - 1 కెజి (మీడియం సైజువి), నూనె - 50 గ్రాములు, సాజీర - 10 గ్రాములు, ఆవాలు - 10 గ్రాములు, చింతపండు (పాతది) - 50 గ్రాములు, టమాట - 100 గ్రాములు, కారం - 5 గ్రాములు, పసుపు - టీ స్పూన్‌, ఉల్లిపాయలు - 150 గ్రాములు, జీలకర్ర మెంతుల పొడి - రెండు టీస్పూన్లు, ధనియాలపొడి- రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - నాలుగు టీస్పూన్లు , కరివేపాకు - ఒకరెబ్బ, పచ్చిమిర్చి - 5 (నిలువుగా కోసినవి), ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - తగినంత, చక్కెర - 3 టీస్పూన్లు
తయారీ విధానం:కొద్దిగా నీరుపోసి చింతపండును నానబెట్టాలి. వెడల్పాటి గిన్నె లేదా బాండీలో నూనెపోసి వేడి చేశాక పచ్చిమిర్చి, సాజీర, ఆవాలు, ముక్కలు తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపేస్ట్‌, టమాటాముక్కలు, కారం, ధనియాలపొడి, జీలకర్ర, మెంతులపొడి, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలపాలి. నానబెట్టిన చింతపండును గుజ్జుగా తీసి పై మిశ్రమంలో కలపాలి. ఉప్పు, చక్కెర వేసి చిక్కని గ్రేవీలా తయారయ్యాక చేపముక్కలను ఆ గ్రేవీలో ఒక్కోటి వేసి పైన మూత పెట్టాలి. అయిదు నిమిషాల తర్వాత ముక్కలను రెండోవైపుకు మార్చి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. ముక్కలను ఎక్కువగా కలపవద్దు. చివర్లో కొత్తిమీర ఆకులను చల్లి దించేస్తే ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ. (చేపల పులుసు చేసిన రోజుకంటే మరుసటి రోజు మరింత రుచిగా వుంటుంది.)

No comments:

Post a Comment